మృతదేహంపై నగలు మాయం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-02 05:49:15  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం ఓ మహిళ మృతి చెందింది. ఆమె ట్రీట్‌మెంట్ పొందుతున్న సమయంలో శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు మరణించాక మాయమయ్యాయి. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన బంధువులు గమనించి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలోనే దొంగతనం జరిగిందా.. లేదా ఇంకెవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన [&hellip;]</p>

మృతదేహంపై నగలు మాయం
X

దిశ, వెబ్‌డెస్క్ :
హైదరాబాద్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం ఓ మహిళ మృతి చెందింది. ఆమె ట్రీట్‌మెంట్ పొందుతున్న సమయంలో శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు మరణించాక మాయమయ్యాయి.

మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన బంధువులు గమనించి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలోనే దొంగతనం జరిగిందా.. లేదా ఇంకెవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Next Story