మఠంలో దొంగతనం

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా తిరుపతిలోని హథీరాంజీ మఠంలో దొంగతనం జరిగింది. హథీరాంజీ మఠానికి చెందిన అకౌంటెంట్ గుర్రప్ప ఇటీవల మృతి చెందారు. దీంతో అందరి సమక్షంలో ఆయన బీరువాను తెరిచి లెక్కలు సరి చూశారు. దీంతో నగల లెక్కల్లో తేడాలను అధికారులు గుర్తించారు. 108 గ్రాముల బంగారు డాలర్, వెండి వస్తువులు మాయమయ్యాయి. దీంతో మఠం సిబ్బంది ఈ ఘనకార్యం మీదంటే మీదేనంటూ నిందలు వేసుకునే ప్రయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన [&hellip;]</p>

మఠంలో దొంగతనం
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా తిరుపతిలోని హథీరాంజీ మఠంలో దొంగతనం జరిగింది. హథీరాంజీ మఠానికి చెందిన అకౌంటెంట్ గుర్రప్ప ఇటీవల మృతి చెందారు. దీంతో అందరి సమక్షంలో ఆయన బీరువాను తెరిచి లెక్కలు సరి చూశారు. దీంతో నగల లెక్కల్లో తేడాలను అధికారులు గుర్తించారు. 108 గ్రాముల బంగారు డాలర్, వెండి వస్తువులు మాయమయ్యాయి. దీంతో మఠం సిబ్బంది ఈ ఘనకార్యం మీదంటే మీదేనంటూ నిందలు వేసుకునే ప్రయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ఆరంభించారు.

Next Story