భద్రాచలం వద్ద టెన్షన్ టెన్షన్..

by  |
భద్రాచలం వద్ద టెన్షన్ టెన్షన్..
X

దిశ, భద్రాచలం టౌన్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీటి వలన భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో 32.4 అడుగులకు గోదావరి నీటిమట్టం పెరిగింది. వరద నెమ్మదిగా పెరుగుతున్నట్టు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.

వాగులు, వంకలు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద వరద 43 అడుగులకు చేరిన సమయంలో జిల్లా కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. జోరు వర్షాలు, వరదల వలన జిల్లాలో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. వరదల వలన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

Next Story

Most Viewed