ప్రియుడి మోసం.. ప్రియురాలి ఆత్మహత్య

by  |
ప్రియుడి మోసం.. ప్రియురాలి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడనే కారణంతో ప్రియురాలు ఆత్మహ్యతకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని చేర్యాల మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చేర్యాలకు చెందిన సరిత అనే యువతి, నరేష్ అనే యువకుడు ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

తీరా పెళ్లి చేసుకోమని అడిగే సరిగి నరేష్ నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన సరిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు మరణానికకి కారణమైన నరేష్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు తండ్రి స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story