బాలిక ప్రాణం తీసిన కోతుల బెడద.. వాటిని చంపుదామనుకుంటే..?

by  |
బాలిక ప్రాణం తీసిన కోతుల బెడద.. వాటిని చంపుదామనుకుంటే..?
X

దిశ, మెట్‌పల్లి : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆడుకుంటున్న బాలిక ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన జిల్లాలోని మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కోరే భవిష్య (8)ఏళ్లు. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని తల్లి కరుణ భవిష్యను తీసుకుని సత్తక్కపల్లికి వెళ్లింది. అక్కడ బంధువుల ఇంటి ముందు ఆడుకుంటూ ప్రహరీ వద్దకు వెళ్లి తీగలను ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయింది.

బాధిత తల్లి, బంధువులు కలిసి మెట్‌పల్లికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలిక చనిపోయిందని వైద్యులు తెలిపారు. అయితే, సతక్కపల్లి గ్రామానికి చెందిన కళ్ళ రాజ గంగారం కోతులను చంపడానికి కరెంటు తీగలను ఏర్పాటు చేయగా, అనుకోకుండా బాలిక వెళ్లి పట్టుకున్నట్టు తెలుస్తోంది. విద్యుత్ షాక్ తన కూతురు చనిపోవడంతో తండ్రి కోరే బాలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇబ్రహీంపట్నం ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.


Next Story

Most Viewed