- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద ప్రభుత్వానికి అందజేయనున్నట్లు హామీ ఇచ్చిన మేరకు ఆరు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులను గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్కు అందజేశారు. ప్రగతి భవన్లో ఆ ఆంబులెన్సులను కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కేటీఆర్ సతీమణి శైలిమా, కూతురు అలేఖ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో పలువురు అంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేటీఆర్కి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇవి కోవిడ్ రెస్పాన్స్ వాహనాలుగా పనిచేస్తాయి. వీటిలో ఆక్సిజన్ సౌకర్యం, వెంటిలేటర్, కరోనా పరీక్షలు చేయడానికి అవసరమైన ఉపకరణాలు ఉన్నాయి.