- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలను చైతన్యపర్చేందుకు ‘ దోమ మస్కట్’
<p>దిశ, న్యూస్బ్యూరో: సీజన్లో దోమల వ్యాప్తిని నియంత్రించుటలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు జీహెచ్ఎంసీ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద లిబర్టీ రోడ్లో ‘ దోమల మస్కట్’ ను ఏర్పాటు చేసింది. దోమల నివారణతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు మస్కట్ను ఏర్పాటు చేసినట్టు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం తెలిపింది. దోమల సంతాన వృద్ధిని అరికట్టుటకు అవగాహన కార్యక్రమాలతో పాటు యాంటి లార్వా స్ప్రేయింగ్ పనులను జీహెచ్ఎంసీ ఎంటమాలజి విభాగం ముమ్మరం చేసింది. ప్రస్తుతం […]</p>

దిశ, న్యూస్బ్యూరో: సీజన్లో దోమల వ్యాప్తిని నియంత్రించుటలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు జీహెచ్ఎంసీ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద లిబర్టీ రోడ్లో ‘ దోమల మస్కట్’ ను ఏర్పాటు చేసింది. దోమల నివారణతో పాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు మస్కట్ను ఏర్పాటు చేసినట్టు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం తెలిపింది.
దోమల సంతాన వృద్ధిని అరికట్టుటకు అవగాహన కార్యక్రమాలతో పాటు యాంటి లార్వా స్ప్రేయింగ్ పనులను జీహెచ్ఎంసీ ఎంటమాలజి విభాగం ముమ్మరం చేసింది. ప్రస్తుతం యాంటీ లార్వా ఆపరేషన్లకు 3డ్రోన్లను వినియోగిస్తున్నారు. మరో 15రోజుల్లో యాంటి లార్వా ఆపరేషన్లకు వినియోగిస్తున్న డ్రోన్ల సంఖ్యను 11కు పెంచనున్నట్టు అధికారులు తెలిపారు. పైలెట్ పద్దతిలో 74ఫాగింగ్ మిషన్లను జిపిఎస్కు లింకప్ చేసి జిహెచ్ఎంసి అధికారులు వాటి పనితీరును మానిటరింగ్ చేస్తున్నట్టు వివరించారు.






