దిశ కథనానికి స్పందన.. పనులు ఆపి, పార్కుకు తాళం వేసిన అధికారులు

by  |
దిశ కథనానికి స్పందన.. పనులు ఆపి, పార్కుకు తాళం వేసిన అధికారులు
X

దిశ, శేరిలింగంపల్లి : దిశ వార్త కథనం పై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. ఈనెల 20న జీహెచ్ఎంసీ పార్క్ స్థలంలో సొసైటీ భవనం శీర్షికన దిశ దినపత్రికలో హైదర్ నగర్ డివిజన్, ఆదిత్య నగర్ పార్క్ లో సొసైటీ భవనం నిర్మిస్తున్నారంటూ వార్త ప్రచురితమైంది. దీనిపై కదిలిన జీహెచ్ఎంసీ సిబ్బంది పార్కులో కొనసాగుతున్న నిర్మాణాన్ని నిలిపివేశారు. అలాగే పార్క్ గేట్ కు తాళం వేశారు. కానీ అందులో ఉన్న నిర్మాణ సామాగ్రిని మాత్రం అలాగే వదిలేశారు. పార్కును పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.


Next Story

Most Viewed