- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సిటీబ్యూరో: టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డికి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పుష్పగుచ్చం ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొంది మేయర్గా అవకాశం దక్కించుకుంది. టీఆర్ఎస్ నేతగా ఉండి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు రేవంత్కు శుభాకాంక్షలు చెప్పడం హాట్టాపిక్గా మారింది.
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్గా గెలుపొందిన ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. ఆయన మంగళవారం జరిగిన కౌన్సిల్ వర్చువల్ మీటింగ్కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి వచ్చారు. కార్పొరేటర్గా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డితో ప్రమాణం చేయించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. అనంతరం పీసీసీ చీఫ్గా నియమితులైన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వర్చువల్ మీటింగ్కు ఆన్లైన్లో హాజరు కావాల్సి ఉండగా.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కార్పొరేటర్ శేఖర్ రెడ్డి నేరుగా వర్చువల్ సమావేశం జరుగుతున్న కమాండ్ కంట్రోల్ రూమ్కు రావటం చర్చనీయాంశమైంది.