ఆ ప్రకటనలకు జీహెచ్ఎంసీకి సంబంధం లేదు: ఎస్ఈసీ

by  |
ఆ ప్రకటనలకు జీహెచ్ఎంసీకి సంబంధం లేదు: ఎస్ఈసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆస్తులపై పార్టీ తరుపున ప్రచారం చేస్తున్నారనే ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. జీహెచ్​ఎంసీ పరిధిలోని బస్​ షెల్టర్లు, మరుగుదొడ్లను ప్రైవేట్​ ఎజెన్సీలతో నిర్మించారని వెల్లడించింది. సొంత ఖర్చులతో వీటిని నిర్మాణం చేస్తారని, జీహెచ్​ఎంసీకి వార్షిక లైసెన్స్​ ఫీజులను చెల్లిస్తారని, ప్రకటనల ద్వారా పెట్టుబడిని పొందుతాయని ఎస్​ఈసీ పేర్కొంది. ప్రకటనలకు ఎజెన్సీలదే హక్కు ఉంటుందని, జీహెచ్​ఎంసీకి ఎలాంటి హక్కు ఉండదని, ప్రైవేట్​ ఎజెన్సీలతో ఒప్పందం చేసుకుని ఎవరైనా ప్రకటనలు చేసుకోవచ్చని తెలిపింది. మెట్రో రైల్​ ప్రాజెక్టు కూడా ప్రభుత్వ, ప్రైవేట్​ భాగస్వామ్య ప్రాజెక్టు అని, ఈ నిర్మాణాలపై హక్కులు ఎల్​అండ్​టీకి ఉన్నాయని, దానిపై ప్రభుత్వ అనుమతి ఉండదన్నారు. అయితే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటనల కోసం ఎజెన్సీలను సందర్శిస్తే అన్ని పార్టీలు, అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని ఎజెన్సీలకు ఆదేశించినట్లు ఎస్​ఈసీ వెల్లడించింది.



Next Story

Most Viewed