జెన్‌కో ఉద్యోగి కుటుంబం అదృశ్యం.. సాగర్‌లో కలకలం

by  |
family missing
X

దిశ, నాగార్జునసాగర్: జెన్‌కో ఉద్యోగి రామయ్య(36) కుటుంబం అదృశ్యం నాగార్జునసాగర్‌లో కలకలం రేపుతోంది. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో రామయ్య బైక్ నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని కొత్త వంతెనపై ఉంది. అటుగా వెళ్తున్న బంధువులు రామయ్య బైక్‌ను చూసి ఆగి, అంతా వెతికారు. ఎంతకీ ఆయన ఆచూకీ లభించలేదు. ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా రామయ్య ఇంటిని తనిఖీ చేయగా, ఆర్థిక, అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాసి లేఖ ఉన్నట్లు తెలిపారు. రామయ్య భార్య నాగమణి, కుమారుడు స్వాతిక్ సైతం కనిపించకపోవడంతో రామయ్య భార్యా,కుమారుడితో కలిసి కృష్ణానదిలో దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ నరసింహరావు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, రామయ్య ఆన్ లైన్ యాప్ ద్వారా చేసిన వ్యాపారంలో నష్టపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.


Next Story

Most Viewed