Gayathri Raghuram : అమ్మాయిలను వాడుకొని వదిలేయడం అలవాటేగా.. విశాల్‌పై నటి ఫైర్

by  |
Gayathri Raghuram : అమ్మాయిలను వాడుకొని వదిలేయడం అలవాటేగా.. విశాల్‌పై నటి ఫైర్
X

దిశ, సినిమా: హీరో విశాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది వివాదాస్పద నటి గాయత్రి రఘురాం. చెన్నైలోని పద్మా శేషాద్రి బాల భవన్ స్కూల్ టీచర్ ఐదేళ్లుగా ఆడపిల్లలను సెక్సువల్‌గా హరాజ్ చేస్తున్నాడన్న విషయం వెలుగులోకి రాగా దీనిపై కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు స్పందిస్తున్నారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని, స్కూల్‌ను మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో విశాల్ ట్వీట్ చేశాడు. ఈ ఇన్సిడెంట్ గురించి విన్నాక భయమేస్తోందని ట్వీట్ చేశాడు. ఉపాధ్యాయుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలన్న ఆయన.. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్‌‌బిల్ మహేష్‌ను కోరాడు.

అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన నటి గాయత్రి రఘురాం.. విశాల్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. ముందు పరిశ్రమలో అమ్మాయిలను లైంగికంగా వేటాడుతున్న, వేధిస్తున్న వారిని ఆపాలని సూచించింది. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న హీరోయిన్ల గురించి ఆలోచించాలన్న ఆమె.. మీరు, మీ స్నేహితులుకూడా అమ్మాయిలను వాడుకొని వదిలేసే బ్యాచ్‌కు చెందినవారే కదా అని ఫైర్ అయింది. మీ వల్ల చాలా మంది మహిళలు ఎఫెక్ట్ అయ్యారని.. ‘ఫీమేల్ లీడ్స్ నీ నుంచి పారిపోతున్నారంటే నీ వల్ల ఎంత ప్రమాదముందో అర్థం చేసుకో’ అంటూ ట్వీట్ చేసింది.



Next Story