ఈ టైంలో ఆ రెండు సినిమాలు మాత్రం చూడొద్దు: గౌతమ్ మీనన్

by  |
ఈ టైంలో ఆ రెండు సినిమాలు మాత్రం చూడొద్దు: గౌతమ్ మీనన్
X

కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతున్న వేళ… భయం వద్దు… నిర్లక్ష్యం అసలు వద్దు.. జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి రక్షించుకోవచ్చు అని సూచిస్తున్నారు సినీ ప్రముఖులు. ఈ క్రమంలోనే ఇంట్లోనే ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు దర్శకులు గౌతమ్ మీనన్. ఈ క్వా రంటైన్ పీరియడ్ లో ఇంట్లోనే ఉంటూ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయాలని సూచించారు. కానీ తన దర్శకత్వంలో వచ్చిన “సాహసం శ్వాసగా సాగిపో”, “ఎంతవాడు గాని” సినిమాలు మాత్రం చూడొద్దని సూచించాడు. ఎందుకంటే సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో ” పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి… పోదాం ఈ దిక్కులు ఆ చుక్కలు దాటి” అంటూ హీరో తన గర్ల్ ఫ్రెండ్ తో టూర్ కి వెళ్తే… ఎంత వాడు గాని సినిమాలో ” నీకేం కావాలో చెప్పు.. లోకమంతా చూడాలా చెప్పు” అంటూ హీరో కూతురితో ప్రపంచాన్ని చుట్టేస్తాడు. ఇలాంటి టైమ్ లో ఆ రెండు సినిమాలు చూస్తే… మనకు కూడా బయటకు వెళ్లి ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది అని… ఇళ్లు దాటి బయటకు వెళ్లడం ఇప్పుడు అంత శ్రేయస్కరం కాదు కాబట్టి ఆ సినిమాలు చూడొద్దని చెప్పాడు గౌతమ్ మీనన్. కాగా ఆయన తాజాగా కనులు కనులు దోచాయంటే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరో కాగా… రీతు వర్మ హీరోయిన్.

Tags : Gautham Menon, Sahasam swasaga sagipo, yentha vaadu gaani, Tollywood, Kollywood



Next Story

Most Viewed