- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు కొంగ జపాలను రాష్ట్రంలో నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. చంద్రబాబు ఈ మధ్య ధర్నాలు చేయాలని సరికొత్త నాటకానికి తెరదీశారని మండిపడ్డారు. గన్నవరంలో బుధవారం మీడియాతో ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ… బద్వేలు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసినా డిపాజిట్ రాకుండా ప్రజలు చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు వయస్సుతో పాటు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచినా కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ముందా అని ప్రశ్నించారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా కేంద్రం నాటకమాడుతుందని దుయ్యబట్టారు. సెస్ పేరుతో వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంటే చంద్రబాబు బీజేపీకి భయపడి నోరు మెదపడం లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు.