- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: వికాస్ దూబే ఎన్ కౌంటర్తో తనకు భయం పట్టుకుందని ఓ గ్యాంగ్ స్టర్ కోర్టుకెక్కాడు. దూబేను కాల్చి చంపినట్టు తనను చంపకూడదని కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన హరియాణాలోని చంఢీగడ్లో జరిగింది. వివరాళ్లోకి వెళితే.. లారెన్స్ బిష్టోయ్(గ్యాంగ్ స్టర్) పలు కేసులకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతడు చేసిన నేరాలపై విచారణ కొనసాగుతూనే ఉంది.
ఇటీవల వికాస్ దూబే ఎన్ కౌంటర్ యూపీలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వార్త విన్న లారెన్స్ అప్రమత్తమయ్యాడు. తనను కూడా ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారన్న భయంతో.. ముందుగానే చంఢీగడ్ కోర్టును ఆశ్రయించాడు. పోలీసులు తనను చంపే ప్రమాదం ఉందని.. తనను విచారిస్తే ఎప్పుడూ బేడీలు వేసే ఉంచాలన్నాడు. కోర్టు తెచ్చే సమయంలో కూడా బేడీలు తీయవద్దని పిటిషన్ వేశాడు. కాగా, లారెన్స్ బిష్టోయ్ రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాల్లో చాలా నేరాల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.