భర్తను బంధించి వివాహితపై గ్యాంగ్ రేప్

by  |
భర్తను బంధించి వివాహితపై గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్ డెస్క్: భర్తను బంధించి భార్యపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా వెలుగోడులో కొంతమంది దుండగులు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తను లాక్కెళ్లి చితకబాది అనంతరం అతడి ముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ విషయమై స్థానికులు సోమవారం తీవ్రంగా ఆగ్రహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed