చైనా అధ్యక్షుడితో యుద్ధం చేస్తున్న వినాయకుడు..

by  |
special ganesha
X

దిశ, పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డి పల్లె గ్రామంలోని క్రిష్ణగిరి క్షేత్రంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేకతను సంతరించుకుంది. కరోనాకు కారణమైన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై యుద్ధం చేస్తున్నట్లుగా వినాయకుడి ప్రతిమను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ వినాయకుడిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు తరలి వస్తున్నారు.

క్రిష్ణగిరి క్షేత్రం ధర్మకర్త కృష్ణానంద స్వామి ప్రత్యేకంగా విగ్రహాలను తయారు చేసే వాళ్లను ఇక్కడకు పిలిపించి ప్రత్యేక శ్రద్ధతో తయారు చేయించారు. కరోనా కారణంగా ఎంతోమంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని, కరోనాతో ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయని, రెండు సంవత్సరాలుగా ఇబ్బంది గుర్తు చేస్తూ ఈ సంవత్సరంతో కరోనా పూర్తిగా అంతమొందాలనే భావనతో వినాయకుని విగ్రహాన్ని చేయించామని తెలిపారు.


Next Story

Most Viewed