గజేందర్ ఆరోపణ.. నిజమేనా ?

by  |
గజేందర్ ఆరోపణ.. నిజమేనా ?
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేసి సంతృప్తి పరచడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలను పునరుద్ధరణ చేస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆప్క గజేందర్ యాదవ్ ఆరోపించారు. కరోనా వైరస్ వ్యాధి విజృంభిసున్న ఈ తరుణంలో స్కూళ్లు తెరవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శనివారం ఆదర్శ్ నగర్ నిర్మల్ జిల్లా బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, నవీన్ కుమార్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed