త్వరలో గడ్డిఅన్నారం మార్కెట్ పున: ప్రారంభం

by  |
త్వరలో గడ్డిఅన్నారం మార్కెట్ పున: ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా విజృంభించడంతో మూతపడ్డ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తిరిగి ప్రారంభం కానుంది. కొత్తపేటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ వీరమల్లు రామనర్సయ్యగౌడ్ అధ్యక్షతన శుక్రవారం పాలకవర్గం సమావేశమైంది. సెప్టెంబర్ 1 నుంచి మార్కెట్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు సమావేశంలో పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ ప్రవీణ్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Next Story