సీఎం జగన్‌పై గద్దె రామ్మోహన్ విమర్శలు

by  |
సీఎం జగన్‌పై గద్దె రామ్మోహన్ విమర్శలు
X

దిశ, ఏపీబ్యూరో: 25వేల ఇళ్లు ఇవ్వలేని సీఎం జగన్ 25 లక్షల ఇళ్లు ఇస్తారా? అంటూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎద్దేవా చేశారు. విజయవాడలో టీడీపీ పూర్తి చేసిన ఇళ్లపై మాట్లాడేందుకు టిడ్కో కార్యాలయానికి వెళ్లి ఎండీని కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. విజయవాడలోని జక్కంపూడి, మంగళగిరిలో టీడీపీ హయాంలో కట్టిన 25వేల ఇళ్లను ప్రభుత్వం ఎవరికీ కేటాయించడం లేదని గుర్తుచేశారు. చిన్నచిన్న మరమ్మతులు చేస్తే ఆ ఇళ్లు పూర్తవుతాయని, వాటిని పేదలకు ఇవ్వొచ్చన్నారు.
అలాంటి ప్రభుత్వం 25లక్షల మంది పేదలకు ఇళ్లు ఇస్తామని చెబుతోందని ఆయన విమర్శించారు.



Next Story

Most Viewed