భవిష్యత్ అంతా కమ్యూనిస్టులదే..

by  |
భవిష్యత్ అంతా కమ్యూనిస్టులదే..
X

దిశ, పటాన్‌చెరు : రాబోయే కాలం ఎర్రజెండాదేనని, భవిష్యత్ అంతా కమ్యూనిస్టుల దేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని సాయి ధర్మపురి గార్డెన్స్‌లో సీపీఐ(ఎం) జిల్లా ద్వితీయ మహాసభలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహాసభల సందర్భంగా రామచంద్రాపురంలో ఎర్రజెండా రెపరెపలాడింది. సంగారెడ్డి జిల్లా సీపీఐ(ఎం) ద్వితీయ మహాసభల సందర్భంగా కార్మిక లోకం, ప్రజల నినాదాలతో దద్దరిల్లింది. పార్టీ ద్వితీయ మహాసభకు భారీ ఎత్తున కార్యకర్తలు, కార్మికులు, స్థానికులు తరలివచ్చారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం మొదటి రోజు వివిధ జిల్లాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. మహాసభల ప్రారంభసభను ఉద్దేశించి సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర నేతలంతా తమ ప్రసంగాలతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. కార్పొరేట్ రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. యావత్ ప్రపంచ దేశాలన్నీ కమ్యూనిస్టుల వైపు చూస్తున్నాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో కమ్యూనిస్టులది కీలక పాత్ర అని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed