ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు విడుదల

by  |
Kalvakurthi
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కృష్ణా బేసిన్​లోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఐదు పంపుల నిర్వహణకు మూడేండ్ల కాలానికి రూ. 13.54 కోట్లను విడుదల చేసింది. ఒక్కో మోటరు 30 మెగావాట్ల కెపాసిటీ ఉండగా 800 క్యూసెక్కుల నీటి సామర్థ్యం ఉంది.

అదేవిధంగా జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్​ మండలంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల నిర్వహణ కోసం రూ. 15.90 కోట్లను విడుదల చేశారు. గోదావరి బేసిన్​లోని ఎస్సారెస్పీ స్టేజ్​ –1లోని వేంపల్లి పంప్​హౌస్​, నవాబ్​ పంప్​హౌస్​, బొదేపల్లి పంప్​హౌస్​ నిర్వహణ కోసం రూ. రెండేండ్ల కాలానికి రూ. 4.27 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పంప్​హౌస్​, ఎత్తిపోతల పథకాల్లో పలు మరమ్మతులు, మోటార్ల నిర్వహణకు ఈ నిధులు వినియోగించాలని సూచించారు.

Next Story

Most Viewed