మద్యం మత్తు.. నడి రోడ్డుపై స్నేహితుడిని కర్రలతో కొట్టి..

by  |
మద్యం మత్తు.. నడి రోడ్డుపై స్నేహితుడిని కర్రలతో కొట్టి..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య స్టార్ట్ అయిన వాగ్వాదం ఓ యువకుడిని బలి తీసుకుంది. యువకుడిని తోటి స్నేహితులే దారుణంగా కొట్టిచంపారు. వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని మురద్​నగర్‌కు చెందిన సోను అనే యువకుడు డైవర్‌గా పని చేస్తు్న్నాడు. సోను.. గంగానదిలో మునిగిపోతున్న చాలా మందిని కాపాడాడు. ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఆ తర్వాత మద్యం మత్తులో వారి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మిగతా స్నేహితులు సోనును అత్యంత దారుణంగా కర్రలతో కొట్టి చంపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.


Next Story

Most Viewed