దారుణం.. విచక్షణా రహితంగా సీసాలతో పొడుచుకున్న స్నేహితులు

by  |
Bottles-Dhadi-1
X

దిశ, శేరిలింగంపల్లి: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. సరదాగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుందామని వెళ్లిన స్నేహితులు మాటామాటా పెరిగి పొడుచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండకు చెందిన శివ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి హైదర్ నగర్ డివిజన్ అంబీరు చెరువు కట్టపై పుట్టినరోజు వేడుకలు జరిపారు. మద్యం సేవిస్తున్న క్రమంలో సాయిరెడ్డి, మరికొందరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తులైన స్నేహితులు సాయిరెడ్డిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. మద్యం సీసాలతో దాడి చేయగా అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఒంటినిండా రక్తంతో తీవ్రగాయలతో పడి ఉన్నాడు. అతని అరుపులు విన్న స్థానికులు అక్కడికి వెళ్లి గాయపడ్డ సాయిరెడ్డిని కేపీహెచ్ బీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story