- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి , హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి ఇంటికీ 20 వేల లీటర్ల లోపు నీటిని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈనెల 12న మంత్రి కేటీఆర్ బొరబండలో ప్రారంభిస్తారని మంత్రి తలసాని వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామి అమలులో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.
గ్రేటర్ పరిధిలో సుమారు 10 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్లో తప్ప దేశంలో ఎక్కడా ఉచితంగా నీటిని సరఫరా చేయడంలేదని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు రూ. 10 వేలు చెల్లించామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు రూ . 25 వేలు ఇస్తామని చెప్పారనీ… కానీ నేటివరకు ఎక్కడా ఇవ్వలేదన్నారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లను దండుకున్నారని విమర్శించారు.