ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్..

by  |
ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఫ్రీగా స్టడీ మెటీరియల్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం రూపొందించిన కీ మెటీరియల్‌ను మంత్రి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు కస్తూర్బా, మోడల్ స్కూల్స్ విద్యార్థులకు సైతం వీటిని అందించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిని మంత్రి ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని మంత్రి తెలిపారు.

Next Story

Most Viewed