బిగ్ బ్రేకింగ్ : ఏపీలో నలుగురు విద్యార్థులకు కరోనా..

by  |
బిగ్ బ్రేకింగ్ : ఏపీలో నలుగురు విద్యార్థులకు కరోనా..
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ ఏపీలో కొవిడ్ మహమ్మారి మరోసారి కలకలం సృష్టించింది. ఈనెల 16 నుంచి ఏపీలో పాఠశాలలు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం యాజలి హైస్కూల్లో నలుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.ఈ విషయం తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురిచేయగా.. అధికారులు హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. వెంటనే పాఠశాలను శానిటైజ్ చేయించారు. కాగా, మూడు రోజుల కిందటే స్కూళ్లు తిరిగి తెరుచుకోగా విద్యార్థులు కరోనా బారిన పడటంతో అటు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.


Next Story