ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

by  |
Road Accident
X

దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొడంగల్ శివారులో రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. హైదరాబాద్ నుంచి కర్నాటక వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.

Next Story