బంజారాహిల్స్‌లో కిడ్నాప్ కలకలం.. మూడు గంటల్లోనే..!

by  |
బంజారాహిల్స్‌లో కిడ్నాప్ కలకలం.. మూడు గంటల్లోనే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. వ్యాపారి అమర్ నాథ్ రెడ్డిని చెన్నైకు చెందిన సినిమా ఆర్టిస్టులు కిడ్నాప్ చేశారు. అనంతరం వ్యాపారి భార్యకు కాల్ చేసి రూ.4లక్షలు డిమాండ్ చేశారు. అమర్‌నాథ్ రెడ్డిని ఓ ఇంట్లో బంధించిన కిడ్నాపర్లు అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది.

వ్యాపారి భార్య ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు అలెర్ట్ అయ్యారు. మూడు గంటల్లోనే ఈ కేసును ఛేదించారు. చెన్నైకు చెందిన నలుగురు కిడ్నాపర్లను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.


Next Story