కర్ణాటకలో నలుగురు హైదరాబాద్ యువకులు మృతి

by  |
Four people dead
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని హబీబ్ ఫాతిమానగర్‌లో విషాదం నెలకొంది. కర్ణాటకలో నలుగురు హైదరాబాద్ యువకులు మృతిచెందారు. కర్ణాటకలోని బీదర్‌ జిల్లా గోడవాడి దర్గాకు దర్శనానికి వెళ్లిన నలుగురు యువకులు పక్కనే ఉన్న చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటమునిగి అందరూ మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన జునైద్ ఖాన్, సయ్యద్ జునైద్, ఫాహద్, హైదర్‌గా పోలీసులు గుర్తించారు. దీంతో ఫాతిమానగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది.



Next Story

Most Viewed