రాజమండ్రిలో సామూహిక ఆత్మహత్యలు

by  |
రాజమండ్రిలో సామూహిక ఆత్మహత్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం నెలకొంది. అంబేద్కర్ నగర్ రామాలయం వీధిలో నివాసముంటున్న ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.మృతుల్లో తల్లీకూతురు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులు సంగిరెడ్డి కృష్ణవేణి, పావని, నిషాన్, రితికలుగా గుర్తించారు.

కుటుంబ కలహాలే సామూహిక ఆత్మహత్యలకు కారణమని బంధువులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed