4 గేదెలు మృతి.. అలా చేయాలని అధికారులను కోరిన యజమాని

by  |
Buffellows-died1
X

దిశ, వేంసూర్: విషతుల్యమైన గడ్డి తిని పాడి గేదెలు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేంసూరు మండలం భీమవరం గ్రామ పరిధిలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విష తుల్యమైన గడ్డిని తీసుకువచ్చి భీమవరం చెరువు దగ్గర డంపు చేశారు. ఆ గ్రామానికి చెందిన వంట్ల నరసింహారావుకు చెందిన 4 గేదెలు ఆ గడ్డిని తిని అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో ఆ గేదెల యజమాని కన్నీరున్నీరయ్యాడు. ఘటనకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరాడు.

Next Story