- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నాగర్ కర్నూల్: గుప్త నిధుల తవ్వకాల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నాగర్కర్నూల్ సీఐ గాంధీ నాయక్ తెలిపారు. నాగర్కర్నూల్ మండలం మంతటిగుట్ట స్వామి ఆలయంలో గతవారం క్రితం కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. కచ్ఛితమైన సమాచారం మేరకు అదే సమయంలో ఎస్ఐ విజయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి దాడిచేశారు. గ్రామానికి చెందిన రాజశేఖర్, పుల్లయ్య, సైదులుతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
అక్కడే ఉన్న రెండు కార్లను స్వాధీనం చేసుకోగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉంటే వారం క్రితం ఈ సంఘటన జరుగగా, కేసు నమోదుకు అలస్యం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరారీలో ఉన్నవారంతా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారని సమాచారం. పరారీలో ఉన్నవారిని, వాహనాలను కేసు నుండి తప్పించేందుకు మంతనాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.