అధికారులపైనే దాడి…అందుకే అరెస్ట్..

by  |
అధికారులపైనే దాడి…అందుకే అరెస్ట్..
X

దిశ వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ అధికారులపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కేసులో నిందితులు కరీం ఆజాద్, ఆఫ్రోజ్, ఇమ్రాన్,సల్మాన్ లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… హఫీజ్ పేటలో అక్రమ నిర్మాణాల విషయం జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆ నిర్మాణాలను కూల్చేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హఫీజ్ పేటకు వెళ్లగా వారితో నలుగురు నిందితులు వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులపై నిందితులు కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. కాగా ఘటనపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.



Next Story

Most Viewed