ఈ నెల 26న భారత్ బంద్

by  |
ఈ నెల 26న భారత్ బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 26న భారత్ బంద్‌కి రైతులు పిలుపునిచ్చారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్న విషయం తెలిసిందే. రైతుల ఉద్యమానికి దేశ ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రతిపక్ష పార్టీలతో పాటు పలువురు సెలబ్రెటీలు రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

అయితే ఈ నెల 26న భారత్ బంద్ చేపట్టనున్నట్లు రైతు సంఘాల ఐక్యవేదిక సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రకటించింది. హోలీ పర్వదినం సందర్భంగా.. వ్యవసాయ చట్టాల పత్రులను దహనం చేస్తామని రైతు సంఘాలు తెలిపాయి.

Next Story

Most Viewed