వారిని శారీరకంగా హింసిస్తూ ఆరో పెళ్లికి రెడీ అయిన మాజీ మంత్రి.. ఇంతలో ట్విస్ట్

by  |
Bride Refusing to Marry Groom with Bad Eyesight
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజలకు మంచి చెప్పాల్సిన ఓ మాజీ మంత్రి.. ఐదు పెళ్లిళ్లు చేసుకుని ఏకంగా ఆరో పెళ్లికి రెడీ అయ్యాడు. విషయం తెలుసుకున్న మూడో భార్య సదరు మంత్రికి ఊహించని విధంగా ఝలక్ ఇచ్చింది. మూడో భార్య పెళ్లిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పెళ్లిని అడ్డుకుని అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మంథోలా పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి చౌదరి బషీర్‌ ఆరో పెళ్లికి సిద్ధపడ్డారు. ఆ విషయం తెలుసుకున్న అతడి మూడో భార్య నగ్మా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బషీర్‌ చౌదరి తనను 2012లో వివాహం చేసుకున్నట్టు నగ్మా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహం తర్వాత తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని ఆరోపించారు. బలవంతంగా తనను అనుభవించేవాడని వాపోయింది. మహిళలను హింసించడం ఆయనకు చాలా ఇష్టమని సంచలన ఆరోపణలు చేశారు.

చౌదరి బషీర్‌ షయిష్ట అనే మరో అమ్మాయిని ఆరో వివాహం చేసుకుంటున్నట్టు జూలై 23న తనకు తెలియడంతో నిలదీశానని పేర్కొంది. అడిగినందుకు తనను తీవ్రంగా కొట్టి హింసించాడని తెలిపింది. ఆ తర్వాత ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి విడాకులు ఇచ్చి ఇంట్లోంచి బయటకు గెంటేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెళ్లిని అడ్డుకున్నారు. ముస్లిం మహిళా వివాహ చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు. గతంలోనూ మాజీ మంత్రి చౌదరి బషీర్‌పై ఈ తరహా కేసు నమోదవగా.. 23 రోజుల పాటు జైల్లో ఉన్నారు.

తొలుత బీఎస్పీలో ఉన్న చౌదరి బషీర్.. మాయావతి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. తర్వాత బీఎస్పీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలో చేరి మంత్రిగా ఉన్నారు. కొన్ని రోజుల కిందట ఆ పార్టీ నుంచి కూడా బయటకొచ్చారు. అయితే, బషీర్‌పై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదు అయినట్టు పోలీసులు వెల్లడించారు.

bashir



Next Story

Most Viewed