బీజేపీలోకి స్వామిగౌడ్​

by  |
బీజేపీలోకి స్వామిగౌడ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్​ స్వామిగౌడ్​ బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న స్వామిగౌడ్​తో బీజేపీ నేతలు చర్చలు సాగించారు. ఇప్పటికే టీఆర్​ఎస్​పై ఆగ్రహంతో ఉన్న స్వామిగౌడ్ పలుమార్లు బహిరంగంగానే పార్టీపై విమర్శలు చేశారు. ఆ తర్వాత పార్టీ నుంచి ఆయనకు అనుకూల సంకేతాలు రావడంతో కొద్దిగా శాంతించారు. కానీ ఇప్పటి వరకు టీఆర్‌ఎస్​ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం లేకపోవడం, తనను పట్టించుకోవడం లేదనే కారణంతో స్వామిగౌడ్​ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. మూడ్రోజలు కిందట రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్వామిగౌడ్​ను కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే స్వామిగౌడ్ బుధవారం ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ సీనియర్​ నేతలతో స్వామిగౌడ్​ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తుపై ఢిల్లీ పెద్దలు కీలక హామీ ఇచ్చినట్టు ముఖ్యవర్గాల సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. స్వామిగౌడ్​ ఢిల్లీలోనే నేడు సాయంత్రం కమలం గూటికి చేరనున్నట్లు సమాచారం. స్వామిగౌడ్​ బీజేపీలో చేరితో ఉద్యోగ వర్గాల నుంచి బీజేపీకి మద్దతు పెరుగుతుందని కమలం శ్రేణులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed