మాజీ హోంమంత్రికి కరోనా నెగిటివ్

by  |
మాజీ హోంమంత్రికి కరోనా నెగిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి కరోనాను జయించారు. గతవారం కరోనా బారినపడ్డ నాయిని, దీంతో ఇటీవల తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అంతేగాకుండా అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో నాయిని చికిత్స పొందుతున్నారు. తాజాగా సోమవారం ఆయనకు మళ్లీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో నాయిని అనుచరులు, కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed