ఇంద్రవెల్లి సభ చరిత్రలో నిలిచిపోతుంది : ప్రేమ్ సాగర్ రావు

by  |
Former MLC Prem Sagar Rao
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉప ఎన్నికల మూలంగా ప్రవేశ పెట్టిన ‘దళిత బంధు’ పథకం తెలంగాణోలని 118 నియోజకవర్గాలకు వర్తింపజేయాలని మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 32 లక్షల దళిత గిరిజన కుటుంబాలు ఉన్నాయని తెలపారు. ఆదివాసీలకు 2008లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఆదివాసీలకు భూమిపై హక్కు కల్పించి, పట్టాలు ఇవ్వాలని, లేకపోతే ఉద్యమం 2023 కొనసాగుతుందని హెచ్చరించారు. ఇంద్రవెల్లి కేంద్రంగా జరిగే సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, టీఆర్ఎస్ పతనం మొదలైందని అన్నారు.


Next Story

Most Viewed