దుగ్యాల నాకు స‌న్నిహితుడు : ఎర్రబెల్లి

by  |
దుగ్యాల నాకు స‌న్నిహితుడు : ఎర్రబెల్లి
X

దిశ ప్ర‌తినిధి,వరంగ‌ల్: పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు మృతిపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ప్ర‌క‌ట‌న‌లో సంతాపం తెలిపారు. దుగ్యాల శ్రీనివాసరావు నాకు సన్నిహితుడు, ఇద్దరం ఒకే నియోజకవర్గానికి చెందిన వాళ్ళమంటూ మంత్రి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారంటూ కొనియాడారు. వారి మరణం తీరని లోటు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.


Next Story

Most Viewed