మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం కన్నుమూత..

by  |
మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం కన్నుమూత..
X

దిశ ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనాకు బలవ్వగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం కరోనా బారినపడి నిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన 1978లో జనతా పార్టీ నుంచి వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన మృతికి వరంగల్ జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.



Next Story

Most Viewed