Breaking news: టీఆర్ఎస్‌లో విషాదం.. మాజీ ఎమ్మెల్యే చేకూరి ఇకలేరు

by  |
chekuri kasayya
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన టీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యం బారినపడిన ఆయన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

కొత్తగూడెం సమితికి రెండుసార్లు సమితి అధ్యక్షుడిగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అంతేగాకుండా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పించి, అందరి మన్ననలు పొందారు. ఖమ్మం రాజకీయాల్లో జలగం వెంగళరావు, శీలం సిద్ధారెడ్డిలతో రాజకీయాలు నడిపి, నిజాయితీకి నిలువుటద్దంలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో కనీసం 50 మంది పేర్లు చెప్పగల గొప్ప వ్యక్తి. గురుదక్షిణ ఫౌండేషన్ ఏర్పాట్లలో కీలకపాత్ర వహించి, తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు.


Next Story

Most Viewed