రాజుల సొమ్ము రాళ్లపాలు.. ప్రజల సొమ్ము నీళ్లపాలు

by  |
రాజుల సొమ్ము రాళ్లపాలు.. ప్రజల సొమ్ము నీళ్లపాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై మాజీమంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగిన ఖర్చుల విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేశారని దుయ్యబట్టారు. రాజుల సొమ్ము రాళ్లపాలు.. ప్రజల సొమ్ము నీళ్లపాలు. సీఎం ఒక్క మీటింగ్‌లో తాగిన వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్ల ఖరీదు రూ.43లక్షలు అంటే.. అది అమృతమైనా అయ్యుండాలి లేకుంటే స్కామైనా చేసుండాలన్నారు. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం రోజు వాటర్ బాటిల్స్, స్నాక్స్‌కి రూ.59.49లక్షలు బిల్లు అయ్యిందంట !..తిన్నవి స్నాక్సా లేకుంటే కరెన్సీ నోట్లా జగన్ రెడ్డి అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Next Story