ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ప్రజలతో మమేకమైన మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి

by  |
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ప్రజలతో మమేకమైన మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి
X

దిశ, నాగర్‌కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 2వ వార్డులో సత్యం అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం ఆయన్ను పరామర్శించారు. వెంటనే ఆర్థిక సహాయం అందజేసి ఆరోగ్యం కుదట పడేంత వరకు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. నాగంతో పాటు డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తిమ్మాజీపేట్ పాండు, తాడూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇతోలే లక్ష్మయ్య, రెండో వార్డ్ కౌన్సిలర్ కొత్త సుమలత గంగాధర్, నిజాం, నాయకులు అప్పల్ శ్రీనివాసులు, వెంకటేష్, అహ్మెద్ పాషా తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed