చందూలాల్ మరణం ములుగు ప్రజలకు తీరనిలోటు : సీతక్క

by  |
చందూలాల్ మరణం ములుగు ప్రజలకు తీరనిలోటు : సీతక్క
X

దిశ, ములుగు: టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి చందూలాల్ మరణం ములుగు ప్రాంత ప్రజలకు తీరనిలోటని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. చందూలాల్ మరణవార్త తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సీతక్క, ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ నుంచి రెండుసార్లు ఎంపీగా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజన శాఖ మంత్రిగా అనేక సేవలు అదించారని తెలిపారు. అనారోగ్యంతో మరణించడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

Next Story

Most Viewed