‘నాపై దాడికి కాపుగాశారు.. వెంటనే ఎస్పీకి ఫిర్యాదు చేశా’

by  |
‘నాపై దాడికి కాపుగాశారు.. వెంటనే ఎస్పీకి ఫిర్యాదు చేశా’
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భిన్నమైన ఆళ్లగడ్డ రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తాను లింగందిన్నె వెళ్తున్నానని తెలిసి వైసీపీ నేతలు దాడికి కాపుకాశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నాపై దాడి చేస్తారని తెలిసి, ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు చేశానని అన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని చెదరగొట్టారని వెల్లడించారు. అరాచకాలతో గెలవాలకుంటే కుదరదు అని, దయచేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయొద్దు అని సూచించారు.

Next Story

Most Viewed