‘అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలి’

by  |
‘అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో వింత పరిస్థితి నెలకొందన్నారు. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ఇస్తే ఉద్యోగులు సహకరించాల్సిందే అని, గవర్నర్‌ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలని ఆయన కోరారు. కోర్టు ఆదేశాలతోనే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అమలు చేస్తున్నారని చెప్పారు.


Next Story