బీజేపీలోకి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై..

by  |
బీజేపీలోకి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై..
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అధికారి కె. అన్నామలై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు కమలం పార్టీలో చేరారు. మంగళవారం ఆయనకు కాషాయ కండువా కప్పి జేపీ నడ్డా సాదరంగా పార్టీకిలోకి ఆహ్వానించారు.

మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై బీజేపీలో సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇకమీదట మీరు ప్రారంభించబోయే కొత్త జర్నీ దిగ్విజయంగా సాగాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎస్‌హెచ్. మురుగున్, బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్‌ స్వరాజ్‌లు పాల్గొనగా, వాటికి సంబంధించిన ఫొటోలను పి. మురళిధర్ రావు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.



Next Story