జట్టు కోసం ధోనీ ఎంతో చేశాడు : గంభీర్

by  |
జట్టు కోసం ధోనీ ఎంతో చేశాడు : గంభీర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోనీపై, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2021 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ధోనీనే కెప్టెన్‌గా కొనసాగిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని గంభీర్ అన్నారు. ఎందుకంటే చెన్నై జట్టు కోసం ధోనీ ఎంతో చేశాడని, మూడు కప్‌లు సాధించి పెట్టడంతో పాటు, ఆడిన ప్రతీ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో చోటు దక్కేలా చాలా కృషి చేశాడని వెల్లడించారు. జట్టు అభివృద్ధి కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపారని తెలిపారు. అంతేగాకుండా ఆ అవకాన్ని ధోనీ కూడా ఉపయోగించుకొని, పూర్తి సామర్థ్యంతో ఆడేందుకు కృషి చేస్తాడని గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed