సీఎస్కేలో మార్పులు ఖాయం : గంభీర్

by  |
సీఎస్కేలో మార్పులు ఖాయం : గంభీర్
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో చోటుదక్కించుకోకుండానే వెనుదిరిగిన సీఎస్కేలో వచ్చే ఏడాది ఖచ్చితంగా మార్చులు జరుగుతాయని వెల్లడించారు. అయితే ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఇప్పటికే ఖాయం కాగా.. ప్రస్తుత జట్టులోని వారిలో చాలామంది సీఎస్కేలో ఉంటారని తెలిపారు. కాగా వచ్చే ఏడాది యువ ఆటగాళ్లకు ఎక్కువగా తీసుకుంటుందని స్పష్టం చేశారు. అంతేగాకుండా ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ సామ్ కరాన్‌ను సీఎస్కే కంటిన్యూ చేస్తుందని, అతడు టాప్ మోస్ట్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని అన్నారు.


Next Story